Bobby: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు చిరంజీవి ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇక చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది హీరోలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న సంగతి తెలుస్తుంది.
ఇదిలా ఉండగా చిరంజీవి హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక ఇటీవల ఈయన చివరిగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఇక చిరంజీవితో సినిమా చేసే హిట్ అందుకున్న బాబి మరోసారి బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు.
త్వరలోనే డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 12వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ బాబి కథ ఎంపిక విషయంలో చిరంజీవి బాలకృష్ణ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా బాబి ఇద్దరి హీరోల గురించి మాట్లాడుతూ…
చిరంజీవి గారికి మనం కథ చెప్పినప్పుడు ఆయన ప్రతిసారి ఆ కథ గురించి అడుగుతూనే ఉంటారు. అలాగే డైలాగ్ పేపర్ కూడా తనకు ముందే ఇవ్వాలని చెబుతారు. ప్రతి విషయంలో చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారని తెలిపారు. ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్య గారికి ఒకసారి కథ చెబితే మరోసారి ఆ కథ గురించి దర్శకుడుని అడగరు. ఆయన గుడ్డిగా డైరెక్టర్లను నమ్మేస్తారు. ఇక సినిమా షూటింగ్ సమయంలో కూడా డైరెక్టర్ చెబితే బాలయ్య అదే చేస్తారని తెలిపారు. ఇలా ఇద్దరు హీరోల గురించి చెప్పడంతో చిరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి గురించి కామెంట్లు చేస్తూ చిరంజీవి కథ విషయంలో ప్రతిసారి వేలు పెట్టి గెలుకుతూ ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…