ప్రముఖ హిందీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో కాసేపటి క్రితం మరణించారు. ఇటీవలే “న్యూరోఎండోక్రిన్ ట్యూమర్” అనే అరుదైన క్యాన్సర్ వ్యాధి నుంచి పోరాడి ఇండియా కు తిరిగివచ్చారు ఇర్ఫాన్ ఖాన్. గత ఏప్రిల్ 25 న ఇర్ఫాన్ ఖాన్ తల్లి కూడా కన్ను మూసారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి కూడా చూసుకోవడానికి నోచుకోలేకపోయాడు ఇర్ఫాన్ ఖాన్. తన తల్లి అంత్యక్రియలను వీడియో మాధ్యమంగా ద్వారా వీక్షించి తల్లడిల్లిపోయారు ఇర్ఫాన్. కన్న తల్లి మరణించి నాలుగైదు రోజులు కూడా కాలేదు… అపుడే ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అనారోగ్యంతో మరణించడం హృదయవిదారకం. ఇర్ఫాన్ అకాల మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ను ముంబై లోని కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. 54 ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్ ను ఐసీయూ లో ఉంచి చికిత్స అందించారు. డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా అయన కోలుకోలేకపోయారు. గత కొన్ని రోజులుగా అయన క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. లండన్ లో చికిత్స తీసుకుని ఇటీవలే భారత్ తిరిగి వచ్చారు. అయన కోలుకోగానే రీసెంట్ గా “అంగ్రేజీ మీడియం” అనే సినిమాలో నటించారు. అదే అయన చివరి చిత్రంగా మిగిలిపోయింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…