Booster Dose: నేటి నుంచి బూస్టర్ డోస్ ప్రారంభం.. ఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే..!
Booster Dose: ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం వ్యాక్సిన్స్ వేగవంతం చేసింది . తాజాగా భారతదేశంలో కూడా లక్షా యాభై వేల కరోనా కేసులు నమోదయ్యాయి . ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం బూస్టర్ డోస్ ను ప్రవేశపెట్టింది. ఈ బూస్టర్ డోస్ వేసుకోవటానికి ఎవరు అర్హులు , ఎందుకు వేసుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం .
దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ప్రజల వారి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు . అందువల్ల ప్రభుత్వం ఈరోజు నుండి (జనవరి 10) ప్రజలకు బూస్టర్ డోస్ వేయనుంది . ఇప్పటికే దేశంలో 150కోట్లకు పైగా కరోనా వాక్సిన్ అందించారు .
ఇప్పటికే 20 మిలియన్ల మంది 15 నుండి18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించారు. కరోనా టీకా వేసుకున్న తర్వాత సమయం గడిచే కొద్దీ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఫ్రంట్లైన్ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా బూస్టర్ డోస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోస్ ఇస్తారు. ఇంతకుముందు కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ వేయించుకోవచ్చు .
కరోనా టీకా రెండవ డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది. కరోనా రెండవ డోస్ పోయిన సంవత్సరం జనవరి , మార్చ్ నెలల మధ్య తీసుకున్నట్లయితే ఇప్పుడు బూస్టర్ డోస్ వేస్తారు. కరోనా టీకా రెండు డోస్లు తీసుకున్న వారు బూస్టర్ డోస్ కోసం నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. టీకా కేంద్రానికి వెళ్లి బూస్టర్ డోస్ వేసుకోవచ్చు. బూస్టర్ డోస్ తీసుకోవటానికి అర్హులైన వారికి ప్రభుత్వం నుండి మెసేజ్ వస్తుంది . కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు కో వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే బూస్టర్ డోస్ కూడా కోవాక్సిన్ ఇస్తారు . అలాగే మొదటి రెండు డోసులు కోవిషీల్డ్ అయితే బూస్టర్ డోస్ కూడా కోవిషీల్డ్ ఇస్తారు. మీరు బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హులు అయితే ప్రభుత్వం మీకు మెసేజ్ పంపిన తర్వాత మీరు కోవిన్ ద్వారా బూస్టర్ డోస్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…