Borugadda Anil Kumar : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాక పుట్టిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి టీడీపీ లోకి జంప్ అయ్యారు. ఇక జగన్ ను వారి ఎమ్మెల్యే తో విమర్శిస్తే వైసీపీ నాయకులు ఊరుకుంటారా.. వైసీపీ చిన్న చిన్న లీడర్లు కూడా ఘాటు వాఖ్యలతో రెచ్చిపోయారు. అలా నెల్లూరు రాజకీయం గుంటూరు వరకు వెళ్ళింది. గుంటూరు జిల్లా రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కోటం రెడ్డి కు ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇవ్వడంతో ఆరోజు రాత్రికే అతని ఆఫీస్ బిల్డింగ్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇక ఈవిషయాల మీద బోరుగడ్డ అనిల్ కుమార్ యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటుగా మాట్లాడారు.
నెల్లూరు రోడ్డులో వేలాడదీస్తా…
మాజీ మంత్రి నక్క ఆనందబాబు అనుచరులతో కలిసి కోటంరెడ్డి తన మనుషులను పంపి తన ఆఫీస్ మీద రాత్రి ఒంటి గంట సమయంలో నిప్పు పెట్టారని అనిల్ కుమార్ ఆరోపించారు. రత్నం బాబు తదితరులు ఈ ఘటనలు ఉన్నారని నా వద్ద ఆధారాలు ఉన్నాయంటూ తెలిపారు. అనిల్ కుమార్ వైసీపీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తుండడం వల్ల తన ఆఫీస్ మీద తానే దాడి చేయించుకుని వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అనే విమర్శలకు సమాధానం చెబుతూ బూతులతో రెచ్చిపోయాడు అనిల్ కుమార్. పదవులను ఆశించి చేయలేదని నా ఆఫీస్ కి నేనే నిప్పు ఎందుకు పెట్టుకుంటాను అంటూ ఘాటుగా స్పందించాడు.
కోటంరెడ్డి మీద చేసిన వాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నెల్లూరు రోడ్డు మీద బండితో లాక్కుని వెళ్లి చర్చి దగ్గర వేలాడదీస్తా అంటూ ఫైర్ అయ్యారు. జగన్ కోసం ప్రాణలైనా ఇస్తామని అలాంటిది జగన్ గురించి మంత్రుల గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాడంటూ మాట్లాడాడు అనిల్ కుమార్. కోటంరెడ్డి నిద్రపోతున్న సింహాన్ని లేపాడంటూ ఇప్పుడు నా ఆఫీస్ ను తగలబెట్టిన దానికి వంద రెట్లు బాధపడేలా చేస్తాను, ఒక దళితుడితో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాను అంటూ ఫైర్ అయ్యాడు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…