ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.ఇండియాలో కరోనా రెండోదశ ఏ స్థాయిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టడంతో భారతదేశంలో లాక్ డౌన్ సడలించారు.ఈ క్రమంలోనే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన జనాలు ఉన్నపళంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అయితే బయటకు వచ్చిన వారు మాస్కు పెట్టుకొని తగినన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మరోసారి ప్రమాదం తలెత్తకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఈ నిబంధనలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో సిమ్లా, ధర్మశాల వంటి పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాజాగ ధర్మశాలలో ఉన్న పర్యాటకులు ఏ ఒక్కరు కూడా మాస్కు ధరించకుండా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆరేళ్ళ కుర్రాడు మాస్కు ధరించి అటుగా మాస్క్ లేకుండా వస్తున్న వారిని ఒక ప్లాస్టిక్ కర్ర తీసుకొని మాస్కులు ధరించండి అంటూ వారిని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ బుడతడు పెద్దవారికి మాస్కు జాగ్రత్తలు చెబుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఈ కుర్రాడు మాస్కులు ధరించండనీ చెబుతుండగా కొందరు నవ్వుతూ వెళ్లడమే కాకుండా మరికొందరు చిన్నోడిని అసహ్యించుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కనీసం కుర్రాడికి ఉన్న బుద్ధి కూడా పెద్దవారికి లేదా.. అసలు వీళ్ళు మనుషులేనా అంటూ పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…