ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.ఇండియాలో కరోనా రెండోదశ ఏ స్థాయిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టడంతో భారతదేశంలో లాక్ డౌన్ సడలించారు.ఈ క్రమంలోనే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన జనాలు ఉన్నపళంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. అయితే బయటకు వచ్చిన వారు మాస్కు పెట్టుకొని తగినన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మరోసారి ప్రమాదం తలెత్తకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఈ నిబంధనలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో సిమ్లా, ధర్మశాల వంటి పర్యాటక ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాజాగ ధర్మశాలలో ఉన్న పర్యాటకులు ఏ ఒక్కరు కూడా మాస్కు ధరించకుండా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆరేళ్ళ కుర్రాడు మాస్కు ధరించి అటుగా మాస్క్ లేకుండా వస్తున్న వారిని ఒక ప్లాస్టిక్ కర్ర తీసుకొని మాస్కులు ధరించండి అంటూ వారిని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ బుడతడు పెద్దవారికి మాస్కు జాగ్రత్తలు చెబుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఈ కుర్రాడు మాస్కులు ధరించండనీ చెబుతుండగా కొందరు నవ్వుతూ వెళ్లడమే కాకుండా మరికొందరు చిన్నోడిని అసహ్యించుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కనీసం కుర్రాడికి ఉన్న బుద్ధి కూడా పెద్దవారికి లేదా.. అసలు వీళ్ళు మనుషులేనా అంటూ పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

































