ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కలల కంటే సరిపోదు.. వాటిని సాకారం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇలా ఓ యువతి తనలక్ష్యం సాధించింది. పోలీసు కొలువు కొట్టాలనే కోరిక నెరవేర్చుకుంది. తల్లిదండ్రుల ఆశలను కూడా నెరవేర్చింది. కానీ ఈ ఘటన జరుగుతుందని వాళ్లు ఊహించుకోలేక పోయారు. ఆమె ఓ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన భవాణి.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మహిళా ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. పీటీసీలో ట్రైనింగ్ నిమిత్తం ఆమె వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆమె.. ఆ రోజు ఇంటికి వస్తున్నా అంటూ తన తల్లిదండ్రులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది.
కానీ అర్థరాత్రి ఆమె తన తరగతి గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఇటు విజయనగరం జిల్లా వాసులకు, కృష్ణాజిల్లా వాసులకు ఈమె మృతి ఎంతో షాక్ కు గురిచేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనా స్థలానికి వెళ్లిన వన్ టౌన్ పోలీసులు పరిసరాలను పరిశీలించారు.
ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమయి ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా..? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయనేది పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు దీనికి కారణం ప్రేమ కూడా ఉండొచ్చనేది పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
చైనాలో సిమ్ కార్డుల నుంచి బంగారం – నెటిజన్ల ఆశ్చర్యం చైనాలోని క్యో అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో…
ప్రపంచంలో అత్యంత చవక పెట్రోల్, భారత్ పరిస్థితి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని సంవత్సరాల్లో భూకంపంలా పెరుగుతున్నాయి.…
ప్రేమికుల రోజు: గిఫ్ట్లు, కేకులు, ఆనందం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీ ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాలనూ ప్రేమికుల…
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…
వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…
రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…