ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు ఓ దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఓ రోజు ఇంట్లో పిల్లలను ఉంచి పనికి వెళ్లింది ఆ మహిళ. ఇంటికి వచ్చే సరికి దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్రావుకు, దుర్గావతి దంపతులు. వారికి ముగ్గురు సంతానం. ముగ్గరు కూడా చిన్న పిల్లలే.
ఉపాధి నిమిత్తం వాళ్లు హైదరాబాద్ కు కొన్నేళ్ల క్రితం వచ్చారు. ప్రదీప్ రావు కుత్బుల్లాపూర్ బీహెచ్ఈఎల్ విస్టాకాలనీలోని శ్రీసాయి నిలయం అపార్ట్మెంట్లో వాచ్మన్గా పని చేస్తున్నాడు. దుర్గావతి పలు ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ రోజు ఉదయం ప్రదీప్ రావు తన డ్యూటీకి వెళ్లిపోగా.. పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా ఇళ్లల్లో పని చేసేందుకు ఆ మహిళ వెళ్లింది.
ఇంట్లోనే ఆడుకొమ్మని వెళ్లిన మహిళ.. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఘోరం జరిగిపోయింది. బాత్రూంకి వెళ్లి చూడగా.. అందులోని ఓ బకెట్లో రెండేళ్ల కొడుకు పడి ఉన్నాడు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే 108 కి కాల్ చేసి.. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో ..ఆ బాలుడు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.
దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హైదరాబాద్ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…