ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు ఓ దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఓ రోజు ఇంట్లో పిల్లలను ఉంచి పనికి వెళ్లింది ఆ మహిళ. ఇంటికి వచ్చే సరికి దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్రావుకు, దుర్గావతి దంపతులు. వారికి ముగ్గురు సంతానం. ముగ్గరు కూడా చిన్న పిల్లలే.
ఉపాధి నిమిత్తం వాళ్లు హైదరాబాద్ కు కొన్నేళ్ల క్రితం వచ్చారు. ప్రదీప్ రావు కుత్బుల్లాపూర్ బీహెచ్ఈఎల్ విస్టాకాలనీలోని శ్రీసాయి నిలయం అపార్ట్మెంట్లో వాచ్మన్గా పని చేస్తున్నాడు. దుర్గావతి పలు ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ రోజు ఉదయం ప్రదీప్ రావు తన డ్యూటీకి వెళ్లిపోగా.. పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా ఇళ్లల్లో పని చేసేందుకు ఆ మహిళ వెళ్లింది.
ఇంట్లోనే ఆడుకొమ్మని వెళ్లిన మహిళ.. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఘోరం జరిగిపోయింది. బాత్రూంకి వెళ్లి చూడగా.. అందులోని ఓ బకెట్లో రెండేళ్ల కొడుకు పడి ఉన్నాడు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే 108 కి కాల్ చేసి.. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో ..ఆ బాలుడు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.
దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హైదరాబాద్ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…