ఆన్ లైన్ గేమ్ ల కారణంగా పిల్లలు వాటికి అలవాటు పడి చదువులకు దూరం అవుతున్నారు. భవిష్యత్తును చక్కగా తీర్చుదిద్దుకోవాల్సిన వయస్సులో ఇలాంటి ఆటలు ఆడుతూ అందులోనే కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా అందులో డబ్బులను పెట్టి.. నష్టాలను మూటకట్టుకోవడంతో పాటు తల్లిదండ్రులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో 16 ఏళ్ల కుర్రాడు, అతడి తల్లిదండ్రులతో నివసిస్తున్నారు.
అతడికి గేమ్ లు అంటే అస్సలు తెలవదు. కానీ అతడికి ఎలా తెలిసిందో ఏమో గానీ.. గత నెలలో అతడు పబ్జీ ఆడటం మొదలు పెట్టాడు. ఈ గేమ్ బాగుందనుకొని తన తల్లి అకౌంట్ నుంచి దాదాపు రూ.10 లక్షలు ఖర్చు పెట్టేశాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియడంతో ఇంట్లో ఓ లెటర్ పెట్టి పారిపోయాడు.
అందులో ఏముందంటే.. ఇంటి నుంచి తాను పారిపోతున్నట్లు రాశాడు. అతడి కోసం వెతికినా తల్లిదండ్రులు లాభం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అతడు ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన ఫోన్ ను కూడా తీసుకెళ్లాడు.
ఫోన్ స్విచ్ఛాప్ చేసిన అతడు దగ్గర్లోని మహాకాళీ గుహల దగ్గర దాక్కున్నాడు. చీకటి పడటంతో అతడు ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు. అప్పటికే పోలీసులు ఆ ఫోన్ ను ట్రాకింగ్ చేయగా.. అతడి అడ్రస్ కనుక్కొని అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. అతడిని.. తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…