చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. అదే విధంగా ఈ సినిమా తరువాత చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ చిత్రమైన లూసిఫర్ రీమేక్ చిత్రాన్ని నటిస్తున్నారు. ఈ చిత్రానికిగాను మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ ప్రజాయుద్ధ నౌక, ప్రజానాట్యమండలి కళాకారుడు గద్దర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గద్దర్ ఈ సినిమాలు ఓ కీలక పాత్రలో నటించబోతున్నారనే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మోహన్ రాజా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాగా ఫేమస్ అయిన నటీనటులను ఈ సినిమాలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం చిత్రబృందం గద్దర్ ను సంప్రదించగా అతను ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , వచ్చే షెడ్యుల్ లో భాగంగా గద్దర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. గద్దర్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్,లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…