ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కలల కంటే సరిపోదు.. వాటిని సాకారం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇలా ఓ యువతి తనలక్ష్యం సాధించింది. పోలీసు కొలువు కొట్టాలనే కోరిక నెరవేర్చుకుంది. తల్లిదండ్రుల ఆశలను కూడా నెరవేర్చింది. కానీ ఈ ఘటన జరుగుతుందని వాళ్లు ఊహించుకోలేక పోయారు. ఆమె ఓ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన భవాణి.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మహిళా ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. పీటీసీలో ట్రైనింగ్ నిమిత్తం ఆమె వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆమె.. ఆ రోజు ఇంటికి వస్తున్నా అంటూ తన తల్లిదండ్రులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది.
కానీ అర్థరాత్రి ఆమె తన తరగతి గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఇటు విజయనగరం జిల్లా వాసులకు, కృష్ణాజిల్లా వాసులకు ఈమె మృతి ఎంతో షాక్ కు గురిచేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనా స్థలానికి వెళ్లిన వన్ టౌన్ పోలీసులు పరిసరాలను పరిశీలించారు.
ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమయి ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా..? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయనేది పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు దీనికి కారణం ప్రేమ కూడా ఉండొచ్చనేది పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…