ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కలల కంటే సరిపోదు.. వాటిని సాకారం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇలా ఓ యువతి తనలక్ష్యం సాధించింది. పోలీసు కొలువు కొట్టాలనే కోరిక నెరవేర్చుకుంది. తల్లిదండ్రుల ఆశలను కూడా నెరవేర్చింది. కానీ ఈ ఘటన జరుగుతుందని వాళ్లు ఊహించుకోలేక పోయారు. ఆమె ఓ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన భవాణి.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మహిళా ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. పీటీసీలో ట్రైనింగ్ నిమిత్తం ఆమె వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆమె.. ఆ రోజు ఇంటికి వస్తున్నా అంటూ తన తల్లిదండ్రులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది.
కానీ అర్థరాత్రి ఆమె తన తరగతి గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఇటు విజయనగరం జిల్లా వాసులకు, కృష్ణాజిల్లా వాసులకు ఈమె మృతి ఎంతో షాక్ కు గురిచేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనా స్థలానికి వెళ్లిన వన్ టౌన్ పోలీసులు పరిసరాలను పరిశీలించారు.
ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమయి ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా..? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయనేది పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు దీనికి కారణం ప్రేమ కూడా ఉండొచ్చనేది పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…