ఏ మహిళకు అయినా తల్లి అవ్వడం అనేది దేవుడు ఇచ్చే వరం లాంటిది. అయితే ఇలా ఓ మహిళకు గర్భం దాల్చితే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె తల్లి.. తన కూతురు బిడ్డకు జన్మనివ్వడానికి ఒప్పుకుంది. 53 ఏళ్ల వయస్సులో ఆమె తన మనుమరాలికి జన్మనిచ్చి ఔరా అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్ దక్షిణ భాగంలోని సెయింట్ కాటరినా నగరంలో ఉన్న టీచర్ రోసిక్లియా డి అబ్రూ కార్సెమ్ అనే మహిళకు ఓ 29 ఏళ్ల కూతురు ఇంగ్రిడ్ ఉంది.
ఆమెకు ఫాబియానా అనే వ్యక్తితో పెళ్లైంది. ఆమెకు పల్మనరీ ఎంబోలిజం అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధితో బాధపడే వారు గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిస్తే.. తల్లి రక్తం గడ్డకట్టి చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆమె పిల్లలు కనే అవకాశం లేకుండా పోయింది. ఓ రోజు ఇంగ్రిడ్ టీవీలో చూసిన ఓ కార్యక్రమం ద్వారా ఆమె ఓ విషయాన్ని గ్రహించింది.
అదేంటంటే.. తన కూతురుకు ఇలానే ఓ వ్యాధి ఉండగా.. తన తల్లి మనవరాలికి ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వెళ్లి తన తల్లికి చెప్పడంతో ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుంది. దీంతో IVF ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు అంతా సిద్దం అయింది. వారు పేదవారు కావడంతో ఆ పద్ధతి కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించారు.
ఫేస్ మాస్కులు అమ్మి.. చిన్నా చితకా పనులు చేసి డబ్బులను కూడపెట్టారు. దీంతో ఐవీఎఫ్ ద్వారా ఆమె తన మనుమరాలికి జన్మనిచ్చింది. ఆమె మాట్లాడుతూ.. తన కూతురుకు, మనవరాలికి జన్మనివ్వడం అనేది చాలా సంతోషంగా ఉదంటూ రోసిక్లియాడి అబ్రూ కార్సెమ్ చెప్పుకొచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లువెరిసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…