Bullet Bhaskar: బుల్లితెర కామెడీ షోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే తాజాగా ఈ వరప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ టీం లో నరేష్ తో పాటు బుల్లెట్ భాస్కర్ తల్లిదండ్రులు కూడా చేశారు. ఓ నటి ‘బావగారూ సినిమాకు తీసుకెళతారా’ అని భాస్కర్ తండ్రిని అడగ్గా.. సెకండ్ షోకు వెళ్లకమ్మా. ఆయనకు రే చీకటి అంటూ తల్లి కౌంటరిచ్చింది. ఆయనకు నెల ఇన్ కమ్ ఎంత వస్తుందమ్మా అని అడగ్గానే 2750 రూపాయలు వస్తుందని చెప్పారు.అదేంటి మరి పెరగదా అనడంతో పెరగదు వేరే గవర్నమెంట్ వస్తేనే పెరుగుతుంది అంటూ వైసీపీ పై పంచ్ డైలాగ్స్ వేశారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్ 2750 రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి డైలాగ్స్ రాసారని తెలిసి వైసీపీ అభిమానులు బుల్లెట్ భాస్కర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.గత ప్రభుత్వం ఎంత పెన్షన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని తెలిపారు.
ఒకవేళ మీరు ఇలాంటి రాజకీయ విమర్శలు కనుక చేయాల్సి వస్తే రాజకీయ వేదికల పైకి వచ్చి విమర్శలు చేయాలి కానీ కళామతల్లి వేదికపై ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు అంటూ తీవ్ర స్థాయిలో బుల్లెట్ భాస్కర్ టార్గెట్ చేయడంతో దెబ్బకు ఈయన వైసిపి అభిమానులకు క్షమాపణలు చెప్పడమే కాకుండా స్కిట్ లో డైలాగ్స్ అన్నింటిని కూడా తొలగించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…