General News

ఎన్95 మాస్కులు ఉతకొచ్చా? నిపుణులు ఏం అంటున్నారంటే?

దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మాస్క్ ఒకటే శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎన్95 మాస్కులు ఎంతో సమర్థవంతంగా అడ్డుకుంటాయి.ఈ మాస్కులు ధరించడం వల్ల 95 శాతం వైరస్ నుంచి మనకు రక్షణ కలిగి ఉంటుంది. అయితే ఈ మాస్కులు ధరలు కూడా అధికంగా ఉండడంతో కొందరు ఈ మాస్క్ లను ఉతికి మరియు ఉపయోగిస్తుంటారు.

ఈ విధంగా ఎన్95 మాస్కులు ఒకసారి ఉపయోగించిన తర్వాత తిరిగి వాటిని వాడకూడదు. కొందరు సబ్బులు, షాంపూలు లేదా ఇతర మెడికల్ డిటర్జెంట్ లను ఉపయోగించి ఉతికి తిరిగి ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా ఉతకడం వల్ల మాస్క్ వైరస్ ను అడ్డుకొనే సామర్థ్యం తగ్గిపోతుంది. తద్వారా ఈ మాస్క్ వేసుకునప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు.

నిజానికి ఎన్95 మాస్కులు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. అలాంటిది కొందరు వీటిని ఉతికి ఉపయోగించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం, రక్షణ ఉండదు. ఎన్95 మాస్కులు లేని వారు మూడు పొరలు కలిగి ఉన్న సాధారణ సర్జికల్ మాస్క్ వాడినప్పటికీ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. గుడ్డ మాస్క్ కన్నా, సర్జికల్ మాస్క్ వైరస్ నుంచి మరింత ఎక్కువ రక్షణ కల్పిస్తుంది.

సర్జికల్ మాస్కు కూడా కేవలం ఒక రోజు మాత్రమే ఉపయోగించాలి. మరుసటి రోజుకు అదే మాస్క్ ఉపయోగించిన ఎలాంటి ఫలితం ఉండదు. సర్జికల్ మాస్క్ ను కూడా ఉతికి ఉపయోగించకూడదు. క్లాత్ మాస్క్ ను తరచూ ఉతికి ఉపయోగించుకోవచ్చనీ నిపుణులు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

7 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

9 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago