కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో గర్బిణీ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల హాస్పిటల్స్ లో ఐసీయు బెడ్స్ దొరకని పరిస్థితి, మరోవైపు ఆక్సిజన్ కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే గర్భిణీ ఉద్యోగులు మరియు మానసిక వికలాంగులైన ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు ఇతర ఉద్యోగులు కూడా కార్యాలయాల్లో కేవలం 50 శాతం ఉద్యోగులు మాత్రమె హాజరవ్వాలని సూచించింది. ఈ నెల మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు కంటైన్మేంట్జోన్ల పరిధిలో ఉన్న ఉద్యోగులకు 50 శాతం అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే వీరందరూ ఫోన్లు మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…