General News

అడవి ఏనుగుకు చిత్రహింసలు పెట్టిన యువకులు.. వైరల్!

ప్రస్తుత కాలంలోని మనుషులలో జాలి, దయ, కరుణ అనేవి మాయమయ్యాయి. సాటి మనుషుల పట్ల,మూగ జంతువుల పట్ల ఏమాత్రం మానవత్వం లేకుండా ఎంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు.మనుషులతో కాకపోయినప్పటికీ నోరులేని మూగ జీవాల పట్ల ఎంతో మూర్ఖత్వంగా ప్రవర్తించి వాటిని హింసిస్తున్నారు. ఈ విధమైనటువంటి సంఘటనలు ఇది వరకు మనం ఎన్నో చూసాము. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.

తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని తిరుమూర్తి ఆనకట్ట దగ్గర నీళ్ల కోసం వచ్చిన ఏనుగులను చూసిన స్థానిక గిరిజనులు వాటిపట్ల ఎంతో విచక్షణారహితంగా ప్రవర్తించారు.ఏనుగుల పై దాడి చేస్తూ వాటిని కర్రలతో బాధడమే కాకుండా వేట కుక్కలను వదిలి రాక్షసానందం పొందారు.

ఈ విధంగా ఈ గిరిజన యువకులు ఏనుగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరును కొందరు యువకులు ఈ కొండపై నుంచి వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు ఆ గిరిజన యువకులు చేసిన పనికి ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అటవీ శాఖ అధికారుల దృష్టికి చేరడంతో వీడియో ఆధారంగా అటవీశాఖ అధికారులు ముగ్గురు గిరిజన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా మూగజీవాలను హింసించినందుకుగాను వారిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago