ప్రస్తుత కాలంలోని మనుషులలో జాలి, దయ, కరుణ అనేవి మాయమయ్యాయి. సాటి మనుషుల పట్ల,మూగ జంతువుల పట్ల ఏమాత్రం మానవత్వం లేకుండా ఎంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు.మనుషులతో కాకపోయినప్పటికీ నోరులేని మూగ జీవాల పట్ల ఎంతో మూర్ఖత్వంగా ప్రవర్తించి వాటిని హింసిస్తున్నారు. ఈ విధమైనటువంటి సంఘటనలు ఇది వరకు మనం ఎన్నో చూసాము. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని తిరుమూర్తి ఆనకట్ట దగ్గర నీళ్ల కోసం వచ్చిన ఏనుగులను చూసిన స్థానిక గిరిజనులు వాటిపట్ల ఎంతో విచక్షణారహితంగా ప్రవర్తించారు.ఏనుగుల పై దాడి చేస్తూ వాటిని కర్రలతో బాధడమే కాకుండా వేట కుక్కలను వదిలి రాక్షసానందం పొందారు.
ఈ విధంగా ఈ గిరిజన యువకులు ఏనుగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరును కొందరు యువకులు ఈ కొండపై నుంచి వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు ఆ గిరిజన యువకులు చేసిన పనికి ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అటవీ శాఖ అధికారుల దృష్టికి చేరడంతో వీడియో ఆధారంగా అటవీశాఖ అధికారులు ముగ్గురు గిరిజన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా మూగజీవాలను హింసించినందుకుగాను వారిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…