కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో గర్బిణీ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల హాస్పిటల్స్ లో ఐసీయు బెడ్స్ దొరకని పరిస్థితి, మరోవైపు ఆక్సిజన్ కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే గర్భిణీ ఉద్యోగులు మరియు మానసిక వికలాంగులైన ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు ఇతర ఉద్యోగులు కూడా కార్యాలయాల్లో కేవలం 50 శాతం ఉద్యోగులు మాత్రమె హాజరవ్వాలని సూచించింది. ఈ నెల మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు కంటైన్మేంట్జోన్ల పరిధిలో ఉన్న ఉద్యోగులకు 50 శాతం అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే వీరందరూ ఫోన్లు మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…