కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో గర్బిణీ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల హాస్పిటల్స్ లో ఐసీయు బెడ్స్ దొరకని పరిస్థితి, మరోవైపు ఆక్సిజన్ కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే గర్భిణీ ఉద్యోగులు మరియు మానసిక వికలాంగులైన ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాదు ఇతర ఉద్యోగులు కూడా కార్యాలయాల్లో కేవలం 50 శాతం ఉద్యోగులు మాత్రమె హాజరవ్వాలని సూచించింది. ఈ నెల మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు కంటైన్మేంట్జోన్ల పరిధిలో ఉన్న ఉద్యోగులకు 50 శాతం అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే వీరందరూ ఫోన్లు మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది.































