AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశామన్నారు.
పోలీసులు కూడా అలాంటి నేరస్తుడికి సహకరించారని మండిపడ్డారు. ఆ నేరస్తుడి పాలనలో సీబీఐ వాళ్లు కూడా అరెస్టు చేయలేక వెనక్కి వచ్చారని గుర్తుచేశారు. అధికారం కోసం కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ప్లే చేశారని కోడి కత్తి డ్రామా సక్సెస్ అయిన గులకరాయి సక్సెస్ కాలేక పోయింది అంటూ జగన్ పై విమర్శలు చేశారు.
ఇక హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది అయితే ఈ ప్రశ్నకు అతి త్వరలోనే సమాధానం దొరుకుతుందని ఆ సమాధానం కోసం ప్రతి ఒక్కరు కాస్త సమయం మనం పాటించాలని తెలియజేశారు. పులివెందల మాదిరిగానే రాష్ట్రాన్ని తయారు చేయాలని గత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని తెలిపారు.
హూ కిల్డ్ ఎన్టీఆర్…
ఎక్కడ చూసినా అధికారుల దోపిడీ జరిగింది ఇసుకలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇలా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు నేటిజన్స్ చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ హూ కిల్డ్ ఎన్టీఆర్ ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుందా బాబు గారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…