AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశామన్నారు.

పోలీసులు కూడా అలాంటి నేరస్తుడికి సహకరించారని మండిపడ్డారు. ఆ నేరస్తుడి పాలనలో సీబీఐ వాళ్లు కూడా అరెస్టు చేయలేక వెనక్కి వచ్చారని గుర్తుచేశారు. అధికారం కోసం కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ప్లే చేశారని కోడి కత్తి డ్రామా సక్సెస్ అయిన గులకరాయి సక్సెస్ కాలేక పోయింది అంటూ జగన్ పై విమర్శలు చేశారు.
ఇక హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది అయితే ఈ ప్రశ్నకు అతి త్వరలోనే సమాధానం దొరుకుతుందని ఆ సమాధానం కోసం ప్రతి ఒక్కరు కాస్త సమయం మనం పాటించాలని తెలియజేశారు. పులివెందల మాదిరిగానే రాష్ట్రాన్ని తయారు చేయాలని గత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని తెలిపారు.
హూ కిల్డ్ ఎన్టీఆర్…
ఎక్కడ చూసినా అధికారుల దోపిడీ జరిగింది ఇసుకలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇలా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు నేటిజన్స్ చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ హూ కిల్డ్ ఎన్టీఆర్ ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుందా బాబు గారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


































