మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించిన ఈ కుర్రాడు తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటాడు.. “శ్రీ రామచంద్రమూర్తి” అనే అందమైన పేరుతో చేసిన ఆ పాత్ర శంకర్ దాదా సినిమా చూసినవారు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమాలో ఆ కుర్రాడు చేసిన క్యారెక్టర్ ఏకంగా సినిమాను మలుపుతిప్పే అద్భుతమైన పాత్ర. అత్యంత కీలకమైన క్యారెక్టర్. సినిమా మొత్తం మీద ఒక్క డైలాగ్ కూడా చెప్పడు కానీ ఆ పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముద్దు ముద్దుగా ఉండే ఆకుర్రాడు అందరిని ఆకట్టుకున్నాడు. అప్పట్లో ఈ కుర్రాడు ఎవరో చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ కుర్రాడు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వాడే..
ప్రస్తుతం ఈ కుర్రోడు కూడా హీరో అయిపోయాడు. ఎవరో తెలుసా? అదేనండీ మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర విడుదల ఆగిపోయింది. అప్పట్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మామయ్య చిరంజీవితో కలిసి నటించాడు. ఆ క్యారెక్టర్ తోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు వైష్ణవ్ తేజ్. అసలు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో నటించింది వైష్ణవ్ అని ఎవరికీ తెలియదు.. ఇప్పుడు తెలిసినవారు అందరు షాక్ అవుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…