మెగాస్టార్ చిరంజీవి తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే “ఖైదీ నెంబర్ 150”, “సైరా నరసింహారెడ్డి” వంటి చిత్రాలలో నటించిన మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ చిత్రం అయిన “లూసిఫర్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు.
ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “వేదాళం” చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ మరో సూపర్ హిట్ రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం వినబడుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తూ ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించింది. అయితే ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్” అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఈ సినిమా తరువాత మెగాస్టార్ తమిళంలో అజిత్ నటించినటువంటి “వేదాళం” సినిమా రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిరంజీవి లేకుండా కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఇందులో హీరో చెల్లెలు పాత్ర ఎంతో కీలకమైనది కాగా చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరొక రీమేక్ చిత్రంలో చేయనున్నట్లు సమాచారం వినబడుతుంది. అజిత్ హీరోగా నటించినటువంటి ‘ఎన్నై అరిందాల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా “ఎంతవాడుగాని” అనే పేరుతో తెలుగులో డబ్ అయి విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఈ స్క్రిప్ట్ ను మెగాస్టార్ చిరంజీవికి అనుగుణంగా మార్చి మరోసారి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…