Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘరానా మొగుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా కోసం అప్పట్లో చిరంజీవి ఏకంగా 1.25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడం విశేషం.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఆయన అభిమానులందరూ చిరంజీవి రాజకీయాలలోకి వస్తారంటూ వార్తలు సృష్టించారు.ఇండస్ట్రీలో ఈయనకున్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఇతను కనక పార్టీ పెడితే ఎన్టీఆర్ లాగే ఇతను కూడా ముఖ్యమంత్రి అవుతారంటూ భావించారు.చిరంజీవి రాజకీయాల ఎంట్రీ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న సమయంలోనే చిరంజీవి మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ముఠామేస్త్రి.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసిన తీరుకు ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో మెగాస్టార్ స్టైల్ ఆయన నటనకు డాన్సులకు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో కూరగాయల మార్కెట్లో ఉన్న వారి సమస్యలను పరిష్కరిస్తూ చివరికి రాజకీయాలలోకి వెళ్లడం ఈ సినిమా అప్పటి రాష్ట్ర రాజకీయాలలో కూడా బాగా కాకరేపింది.
అప్పటికే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి వస్తే ఎలా ఉంటుంది అనే భావన ఉన్న అభిమానులు ఈయన కనుక ముఖ్యమంత్రి అయితే ఇక తిరుగు ఉండదని భావించారు.ఇలా ఈ రెండు సినిమాలు చిరంజీవిని రాజకీయాలలోకి తీసుకురావడానికి మూల స్తంభాలుగా నిలిచాయని ఈ సినిమాల వల్లే తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ కల్పించారని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈయన ప్రజారాజ్యం పార్టీ పేరుతో రాజకీయాలలోకి వచ్చిన అనంతరం తనకు సినిమాలే సెట్ అవుతాయని తిరిగి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి అంకితమయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…