Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘరానా మొగుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా కోసం అప్పట్లో చిరంజీవి ఏకంగా 1.25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడం విశేషం.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఆయన అభిమానులందరూ చిరంజీవి రాజకీయాలలోకి వస్తారంటూ వార్తలు సృష్టించారు.ఇండస్ట్రీలో ఈయనకున్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఇతను కనక పార్టీ పెడితే ఎన్టీఆర్ లాగే ఇతను కూడా ముఖ్యమంత్రి అవుతారంటూ భావించారు.చిరంజీవి రాజకీయాల ఎంట్రీ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న సమయంలోనే చిరంజీవి మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ముఠామేస్త్రి.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసిన తీరుకు ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో మెగాస్టార్ స్టైల్ ఆయన నటనకు డాన్సులకు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో కూరగాయల మార్కెట్లో ఉన్న వారి సమస్యలను పరిష్కరిస్తూ చివరికి రాజకీయాలలోకి వెళ్లడం ఈ సినిమా అప్పటి రాష్ట్ర రాజకీయాలలో కూడా బాగా కాకరేపింది.
అప్పటికే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి వస్తే ఎలా ఉంటుంది అనే భావన ఉన్న అభిమానులు ఈయన కనుక ముఖ్యమంత్రి అయితే ఇక తిరుగు ఉండదని భావించారు.ఇలా ఈ రెండు సినిమాలు చిరంజీవిని రాజకీయాలలోకి తీసుకురావడానికి మూల స్తంభాలుగా నిలిచాయని ఈ సినిమాల వల్లే తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ కల్పించారని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈయన ప్రజారాజ్యం పార్టీ పేరుతో రాజకీయాలలోకి వచ్చిన అనంతరం తనకు సినిమాలే సెట్ అవుతాయని తిరిగి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి అంకితమయ్యారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…