Chiranjeevi postponed his movie because of NTR : టాలీవుడ్ టాప్ హీరోలు మెగాస్టార్ ఒకరు, అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ సినిమా కూడా రిలీజ్ అవుతుందని తన సినిమాని వాయిదా వేసుకున్న సందర్భం ఉంది. ఈ సందర్భం 19 ఏళ్ల క్రిందట జరిగినది. ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా ఒకే టైం లో వచ్చాయి. అందులోనూ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమా కి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కు దర్శకుడు బి.గోపాల్ కావడం విశేషం. ఇక రెండు సినిమాలోని హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కావడం మరో విశేషం. అయితే ఈ రెండు చిత్రాలను నిర్మాతలు జూలై 18న ఒకే రోజు విడుదల చేయాలని భావించారట.
చిరంజీవి ఇంద్ర సినిమా వాయిదా వేసుకోవడానికి గల కారణం….
అల్లరి రాముడు సినిమా విడుదల మందు ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా ఆది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కు ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అప్పుడు ఆ సినిమా విజయంతో ఎన్టీఆర్ మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ చిరంజీవి ‘మృగరాజు’, ‘శ్రీ మంజునాథ’,‘డాడీ’వంటి వరుస పరాజయాలతో నిరాశ లో వున్నారు. ఈ వరుస సినిమాల పరాజయం వళ్ళ చిరంజీవి అంత ఫామ్ లో లేరు.
ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమా చిరంజీవి ఇంద్ర సినిమాలు రెండు ఒకే రోజు విడుదల చేయాలని నిర్మాతలు భావించడంతో చిరంజీవి కాస్త వెనకడుగు వేశారట. అల్లరి రాముడు సినిమా హిట్ అయి చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే చిరంజీవి ఇమేజ్ మీద దెబ్బ పడుతుంది అని ఇండస్ట్రీ లో టాక్ కూడా నడిచిందట. పైగా చిరంజీవి ఇంద్ర సినిమా కి రన్ టైం ఇష్యూస్ కూడా ఉండటంతో, ఇంద్ర సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేసి జూలై 24 న విడుదల చేశారట. అయితే మొదట విడుదలైన అల్లరి రాముడు సినిమా మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఎన్టీఆర్ ఇమేజ్ వల్ల మాత్రమే ఆ సినిమాకు ఓపెనింగ్స్ దక్కాయి. ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒకవేళ అదే టైంలో ఇంద్ర సినిమా విడుదల అవ్వకపోయివుంటే అల్లరి రాముడు సినిమా అవేరేజ్ టాక్ ఐనా తెచ్చుకునేది.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…