Megastar Chiranjeevi: సీని కార్మికులపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..అలా నేను ఉండనంటూ షాకింగ్ కామెంట్స్..!
Megastar Chiranjeevi: కరోనా కారణంగా ఇప్పటికే చాలామంది సినీ కార్మికులు ఇబ్బందులకు గురయ్యారని.. వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలనే కోరిక తనకు ఉందని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతీ ఒక్కరికీ.. అన్ని వర్గాల వారికీ యోధా డయాగ్నోస్టిక్స్ ల్యాబ్లో పరీక్షలు, అవసరమైన చికిత్స కోసం 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
తన కోరికను అంగీకరించి.. వెంటనే ఒప్పుకున్న యోధా డయాగ్నోస్టిక్స్ యాజమాన్యానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం సంతోషం అన్నారు. ఇక నుంచి ఆసుపత్రికి సంబంధించి చికిత్స, పరీక్షలకు 50 శాతం రాయితీపై ఇవి పనిచేస్తాయన్నారు.
సినీ పరిశ్రమకు పెద్దన్నగా చిరంజీవి కావాలని ప్రతీ ఒక్కరూ అంటున్నారని.. కానీ తాను పెద్దన్నగా ఉండటం ఇష్టం లేదని.. కానీ అండగా.. అంటానని అన్నారు. అవసరమైనప్పుడు మీతోడుగా మాత్రం ఉంటానన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సపోర్టుగా నిలుస్తానన్నాడు.
ఇలా తన మనస్సులో మాటను స్పష్టం చేశాడు మెగస్టార్ చిరంజీవి. అండగా ఉండే పదవి తనదేనని.. పంచాయతీ చేసే ఉద్దేశ్యం తనకు లేదని అన్నాడు. సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉండటం తనకు ఇష్టం లేదని.. కానీ సినీ కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా.. ముందుంటానని.. వారి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటానని వెల్లడించారు. దాసరి నారాయణరావు మరణం తర్వాత సినీ పరిశ్రమకు పెద్దన్నగా ఎవరూ లేరని.. కానీ ఆ ప్లేస్ ను రిప్లేస్ చేసే హక్కు మీకే ఉందని.. ఆ బాధ్యతలు స్వీకరించాలని చిరంజీవిని కోరగా..అతడు ఇలా సున్నితంగా బదులు ఇచ్చాడు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మాత్రం పెద్దన్నగా ఉంటానన్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…