Chiranjeevi -Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుందనే విషయం మనకు తెలిసిందే.ఈ రెండు కుటుంబాల మధ్య బహిరంగ మనస్పర్ధలు లేకపోయినా అంతర్గత మనస్పర్ధలు ఉన్నాయని విషయం అందరికీ తెలిసిందే. గతంలో మా ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో మనకు తెలిసిందే.
మా అధ్యక్షత పదవికి మంచు విష్ణు పోటీ చేయగా మెగా ఫ్యామిలీ మద్దతుతో నటుడు ప్రకాష్ రాజు కూడా ఈ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఇలా ఎన్నో విమర్శల నడుమ మా ఎన్నికల జరగడం మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. ఈ ఎన్నికల తర్వాత ఏదో ఒక విషయంలో మంచు మెగా ఫ్యామిలీల మధ్య గొడవ జరుగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మా అధ్యక్షుడు ఊహించని షాక్ ఇచ్చారు.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో పాటు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా అదే రోజు విడుదల కావడంతో ఇద్దరు హీరోల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఇలా ఇద్దరు హీరోలు దసరా బరిలో దిగుతుండగా ఊహించని విధంగా వీరికి పోటీగా మంచు విష్ణు సైతం దసరా బరిలోకి పోటీ నిలిచారు.
మంచు విష్ణు సూర్య అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నటించినటువంటి చిత్రం జిన్నా.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా కూడా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఒకసారిగా మెగా అభిమానులు షాక్ అయ్యారు.ఇలా ఒకేరోజు నాగార్జున చిరంజీవి విష్ణు సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల కొరత ఏర్పడుతుందని పూర్తిగా అందరి సినిమాలపై ప్రభావం ఏర్పడే పరిస్థితిలో ఉన్నాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి మంచు విష్ణు ఊహించని విధంగా జిన్నా సినిమా విడుదల తేదీ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…