Priyamani:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలో పలు సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి మూడవ సంవత్సరంలో ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె పెళ్లయిన కొత్తలో, యమదొంగ, నవవసంతం వంటి పలు సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా హీరోయిన్ గా పలువురు హీరోలు సరసన నటించిన ఈమె మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ పలు వెబ్ సిరీస్ లు చేస్తూ, సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక బుల్లితెర పై ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో కార్యక్రమానికి కూడా ఈమె న్యాయ నిర్ణయతగా వ్యవహరించారు.ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర కార్యక్రమాలలోనూ సినిమాలు వెబ్ సిరీస్ లలో చేస్తూ ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి ప్రియమణి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే ప్రియమణి కెరియర్ మొదట్లో అందరిలాగే తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.తాను ఏదైనా ఒక సినిమా ఎంచుకునే ముందు పూర్తిగా కథపై అవగాహన చేసుకున్న తర్వాతే సినిమాకి ఓకే చెప్తానని ఈమె తెలియజేశారు.అయితే ఓ తెలుగు సినిమా విషయంలో తాను పొరపాటు చేశానని అయితే కథ చెప్పింది ఒకటి సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒకటి చేశారంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు.
ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఓ సినిమాకి కమిట్ అయ్యానని అయితే ఈ సినిమా సగం షూటింగ్ అయిన తర్వాత ఓ సన్నివేశం కోసం నిర్మాత బొడ్డు దగ్గర టాటూ వేయించుకోవాలని ఇబ్బంది పెట్టారంటూ ప్రియమణి వెల్లడించారు.అయితే నిర్మాత అలా చెప్పేసరికి తాను నో అని చెప్పాను కాకపోతే అప్పటికే సగం సినిమా పూర్తి అయ్యింది ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని బలవంతంగా ఇష్టం లేకపోయినా టాటూ వేయించుకోవాల్సి వచ్చిందంటూ ఈ సందర్భంగా ప్రియమణి తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది గురించి వెల్లడించారు.ఇలా ఆమె తన ఇబ్బందులను తెలిపినప్పటికీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు ఆ సినిమా ఏంటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…