Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఈమె ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన ఈమె నాగచైతన్యతో ప్రేమలో పడి దాదాపు 7 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా మూడు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈమె కొన్ని మనస్పర్ధలు కారణంగా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు.ఇక నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడంతో సమంతదే తప్పు అన్నట్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.సమంత వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు రావడం విడిపోవడం జరిగింది అంటూ సమంత గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
సమంత ఇలాంటి వార్తలన్నింటిని తిప్పికొడుతూ సమాధానం చెప్పారు. ఇకపోతే తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సమంతకు సద్గురు బాబా ఒక మంచి వరుడిని వెతికి పెట్టారని ఆయన సమక్షంలోనే సమంత రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సమంత సద్గురు బాబాను ఎంతగానో విశ్వసిస్తారు.
సమంత సద్గురు బాబా మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.ఆయన చెప్పే ప్రవచనాలను సమంత తప్పకుండా వింటుందని ఆయన తనకు ఓ తండ్రితో సమానం అంటూ సమంత ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే సమంత భవిష్యత్తు గురించి ఆలోచించిన సద్గురు ఆమెను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారని అందుకు సమంత కూడా అంగీకరించింది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.ఇక సమంతకు కూడా సద్గురు మాట వేదవాకు అని సమంత తప్పకుండా రెండో పెళ్లికి ఒప్పుకొనే ఉంటుందంటూ పలువురు నెటిజన్ లు ఈ విషయంపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మరి సమంత నిజంగానే రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…