Chiranjeevi Vs Garikapati : ప్రతి ఏడాది బీజేపీ లీడర్ దత్తాత్రేయ గారు అలాయ్ బలయ్ నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఈ ఏడాది కూడా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో అలాయ్ బలయ్ నిర్వహించారు. రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ సారి ఆ వేడుకలో ఒక చిన్న వివాదం చోటు చూసుకుంది. సినిమా ఇండస్ట్రీ నుండి హాజరైన ప్రముఖుల్లో చిరంజీవి గారు ఉన్నారు. రాకరాక మెగాస్టార్ రావడంతో సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడ్డారు. ఫోటో దిగాలని ఎవరికి ఉండదు అలా ఆయనతో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకునే గరికపాటి గారు ఆయన పై అసహనం వ్యక్తం చేసారు.
చిరు తో మాట్లాడుతానన్న గరికపాటి…
మీరు ఫోటో సెషన్ ఆపేస్తే నేను ప్రవచనాలు చెబుతాను లేకుంటే ఇక్కడి నుండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంటూ చెప్పడం తో మెగా అభిమానులకు కోపం వచ్చింది. చిరంజీవి గారు ఆయన అసహనానికి చిరాకు పడకుండా ఫోటోసెషన్ ఆపి ఆయనకు శిరసు వంచి నమస్కారం చేసారు. దీనికి మెగా అభిమానులు గరికపాటిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. శిఖరం లాంటి వ్యక్తి మీముందు శిరసు వంచితే అహంకారంతో మాట్లాడుతావా అంటూ గరికపాటిని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి గరికపాటి గారు ఇంతకుముందు కూడా ఇలానే కొందరు సెల్ఫీలంటూ ఫోటో షూట్ చేసేవాళ్ళను అలానే అన్నారు. కానీ ఇక్కడ మెగాస్టార్ అవ్వడం వల్ల మెగా అభిమాల మనసు చివుకుమంది.
ఇక ట్రోల్ల్స్ తో ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరేత్తిస్తున్నారు. దీంతో ఈ వివాదం ఇంకొంచం ముదరకూడదనే ఉదేశంతో మెగా అభిమాని ఒకరు చొరవ తీసుకుని గరికపాటి గారికి ఫోన్ చేసి మెగాస్టార్ తో మాట్లాడమని అడిగారు. దీనికి గరికపాటి గారు కూడా సానుకూలంగా స్పందించడం వల్ల గొడవ ఇక్కడే సమసినట్లే అనిపిస్తోంది. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్ స్వయంగా గరికపాటి నరసింహారావుకి కాల్ చేసి మాట్లాడారు. చిరంజీవి గారిని అలా మాట్లాడినందుకు మెగా అభిమానులు బాధపడుతున్నారు వారి కోపాన్ని ఖచ్చితంగా చల్లభరుస్తాము కానీ మీరు చొరవ తీసుకుని మెగాస్టార్ తో మాట్లాడండి అంటూ కోరడంతో గరికపాటి గారు కూడా సానుకులంగా స్పందించడం తో గొడవ సమసిపోయినట్లే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…