General News

నువ్వు పురుషుడివేనా నిరూపించుకో అంటూ పింఛన్ అడిగిన వృద్దుడికి వింత పరీక్షా?

ఆరు పదుల వయసు దాటిన ఓ వృద్ధుడికి ప్రభుత్వ అధికారులు ఓ వింత పరీక్ష పెట్టారు. 60 సంవత్సరాలు పైబడటంతో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న ఆ వృద్ధుడు చూపును కోల్పోయాడు. ఈ క్రమంలోనే అతను ఈ వయసులో తన పురుషుడని నిరూపించుకుంటూనే తనకు పింఛను అందుతుందని అధికారులు కండిషన్ పెట్టారు. లేకపోతే తనకు పింఛన్ రాదని అధికారులు తేల్చి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లా,గంగాధర నెల్లూరు మండలం వీరకనెల్లూరుకు చెందిన వృద్ధుడు నామాల నాగయ్యకు ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది.

బాధితులు తెలిపిన వివరాల మేరకు నాగయ్య ఇదివరకు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో నాగయ్య కంటిచూపును కోల్పోవడంతో ప్రభుత్వం నుంచి అంధత్వ దృవీకరణ పత్రాన్ని పొందాడు.ఈ క్రమంలోనే ధ్రువీకరణ పత్రం ఆధారంగా తనకు వృద్ధాప్య పింఛన్ కాకుండా వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని అధికారులను విన్నవించుకున్నాడు.

నాగయ్య ఇదివరకు వితంతు పెన్షన్ అందుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారక వెబ్ సైట్ లో ఉంది. రేషన్ కార్డులో నాగయ్య పురుషుడిగా నమోదయింది. ఈ క్రమంలోనే నాగయ్య పురుషుడిగా నిరూపించుకుంటే అతనికి పెన్షన్ అందుతుందని లేకపోతే పెన్షన్ రాదని అధికారులు ఇస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్ కూడా రద్దు చేస్తూ నాగయ్యకు నోటీసులు జారీ చేశారు.

ఈ విధంగా అధికారులు జారీ చేసిన నోటీస్ అందగానే 15 రోజుల లోగా అతడు పురుషుడని నిరూపించుకుంటేనే అతనికి పెన్షన్ అందుతుందని అధికారులు నోటీసులో తెలియపరచడంతో సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కు వచ్చి నాగయ్య తన సమస్యను అధికారులకు తెలియజేశారు. నాగయ్య సమస్యను విన్న అధికారులు అతనికి సహాయం చేస్తామని ఎంతో సానుకూలంగా స్పందించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago