ఆరు పదుల వయసు దాటిన ఓ వృద్ధుడికి ప్రభుత్వ అధికారులు ఓ వింత పరీక్ష పెట్టారు. 60 సంవత్సరాలు పైబడటంతో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న ఆ వృద్ధుడు చూపును కోల్పోయాడు. ఈ క్రమంలోనే అతను ఈ వయసులో తన పురుషుడని నిరూపించుకుంటూనే తనకు పింఛను అందుతుందని అధికారులు కండిషన్ పెట్టారు. లేకపోతే తనకు పింఛన్ రాదని అధికారులు తేల్చి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లా,గంగాధర నెల్లూరు మండలం వీరకనెల్లూరుకు చెందిన వృద్ధుడు నామాల నాగయ్యకు ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది.

బాధితులు తెలిపిన వివరాల మేరకు నాగయ్య ఇదివరకు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో నాగయ్య కంటిచూపును కోల్పోవడంతో ప్రభుత్వం నుంచి అంధత్వ దృవీకరణ పత్రాన్ని పొందాడు.ఈ క్రమంలోనే ధ్రువీకరణ పత్రం ఆధారంగా తనకు వృద్ధాప్య పింఛన్ కాకుండా వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని అధికారులను విన్నవించుకున్నాడు.
నాగయ్య ఇదివరకు వితంతు పెన్షన్ అందుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారక వెబ్ సైట్ లో ఉంది. రేషన్ కార్డులో నాగయ్య పురుషుడిగా నమోదయింది. ఈ క్రమంలోనే నాగయ్య పురుషుడిగా నిరూపించుకుంటే అతనికి పెన్షన్ అందుతుందని లేకపోతే పెన్షన్ రాదని అధికారులు ఇస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్ కూడా రద్దు చేస్తూ నాగయ్యకు నోటీసులు జారీ చేశారు.
ఈ విధంగా అధికారులు జారీ చేసిన నోటీస్ అందగానే 15 రోజుల లోగా అతడు పురుషుడని నిరూపించుకుంటేనే అతనికి పెన్షన్ అందుతుందని అధికారులు నోటీసులో తెలియపరచడంతో సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కు వచ్చి నాగయ్య తన సమస్యను అధికారులకు తెలియజేశారు. నాగయ్య సమస్యను విన్న అధికారులు అతనికి సహాయం చేస్తామని ఎంతో సానుకూలంగా స్పందించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.





























