Featured

CM Jagan mohan reddy : ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పింది… ఆ పాదయాత్రపై ఎవరూ మాట్లాడొద్దు… అందరికీ ఆదేశాలు వచ్చాయి… లోకేష్ పాదయాత్రపై ఊహించని నిర్ణయం…!

CM Jagan Mohan reddy : పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన నాయకులకు మన దేశంలో కొదవ లేదు. అయితే ఏపీలో పాదయాత్ర అనగానే రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తారు. ఆ తరువాత ఆయన కూతురు షర్మిల అన్న జగన్ జైలులో ఉన్నపుడు ఓదార్పు యాత్ర అంటూ చేసారు. ఆపైన జగన్ కూడా పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేసి జనంలోకి వెళ్లారు. ఇక తెలుగు దేశం అధినేత చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఒకవైపు ఇండియా మొత్తం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నా పెద్దగా ఎక్కడా హైప్ లేదు. ఇక ప్రస్తుతం ఏపీలో మరోసారి పాదయాత్ర నడుస్తోంది. ఈ సారి జగన్, చంద్ర బాబు కాదు.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నాడు. అయితే ఈ పాదయాత్ర గురించి పెద్దగా చర్చ లేదు, మీడియా కవరేజ్ లేదు. ఇక సీఎం జగన్ కు ఇంటలిజెన్స్ రిపోర్ట్ రావడంతో లోకేష్ పాదయాత్ర మీద అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

ఎవరూ మాట్లాడొద్దు…

లోకేష్ పాదయాత్ర మొదటి రోజు తారకరత్నకు గుండెపోటు రావడంతో ఆ రోజు మొత్తం తారక రత్న గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక ఓ నాలుగు రోజులు అదే సాగగా ఆ తరువాత అసంతృప్త వైసీపీ లీడర్స్ ప్రెస్ మీట్ హైలైట్ అయింది. నిజానికి టీడీపీ అనుకూల మీడియాలో కూడా పాదయాత్ర గురించి పెద్దగా కవరేజ్ లేదు. ఇక సీఎం జగన్ కి ఇంటలిజెన్స్ రిపోర్ట్ లో కూడా లోకేష్ పాదయాత్ర ను జనాలు సీరియస్ గా తీసుకోలేదనే వచ్చిందట.

అంతేకాక జనాలు కూడా లోకేష్ పాదయాత్రకు పలుచగా ఉన్నట్లు తేలింది. దీంతో జగన్ కూడా తన ఎమ్మెల్యేలకు పార్టీ లీడర్లకు లోకేష్ పాదయాత్ర గురించి గైడన్స్ ఇచ్చారట. ఎవరూ లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడొద్దని చెప్పారట. అనుకూల మీడియాలోనే కథనాలు రానపుడు మనం లోకేష్ ను విమర్శించి మరీ ఎందుకు హైలైట్ చేయాలి అని జగన్ సూచించారట. లోకేష్ ఎలా విమర్శించినా ఎవరూ పట్టించుకోవద్దు, కౌంటర్ ఇచ్చి మనమే హైప్ లోకేష్ ఇవ్వద్దు అని డిసైడ్ అయ్యారట జగన్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago