YS Jagan: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా కూటమి పెద్దలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సభ్యులందరూ కుమ్మక్కయి తనపై యుద్ధానికి దిగుతున్నారని తెలిపారు. అయితే కూటమి సభ్యులు కుట్రలో భాగంగా అధికారులను కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురిచేస్తున్నారని జగన్ ఆరోపణలు చేశారు.
ఎన్నికలకు మరొక ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో పెద్ద ఎత్తున అధికారులు అందరిని కూడా బదిలీలు చేస్తూ వారికి సానుకూలంగా ఉన్నటువంటి వారిని ఆ స్థానాలలోకి తీసుకురావడం పట్ల జగన్ స్పందించారు. ఇలా అధికారులు అందరిని కూడా స్థాన మార్పిడి చేస్తూ కుట్రలకు తెర లేపుతున్నారని తెలిపారు.
ఇలా కూటమి కుట్రలు చూస్తుంటే ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం కూడా సన్నగిల్లుతోందని జగన్ ఆరోపణలు చేశారు.ఏపీలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేయడంతో ఆయన స్థానంలో కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా నియమితుడైన విషయం తెలిసిందే. ఇక అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.
ఓటమి భయమే కారణమా..
అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా అధికారులందరిని స్థాన మార్పిడీలు చేయడంతో కుట్రకు తెర లేపుతున్నారని, ఓటమి భయం కారణంగానే ఇలా అధికారులను స్థాన మార్పిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారట జగన్ ఆరోపణలు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…