Omicron Cases: నవోదయ పాఠశాలలో 85మందికి కరోనా..ప్రిన్సిపాల్ తో సహా..!
Omicron Cases: ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని 85 మంది విద్యార్థులు కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాధి సోకిన విద్యార్థులను వేర్వేరు హాస్టళ్లలో ఉంచారు.
పాఠశాలను మైక్రో-కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మొదట్లో పదకొండు మంది విద్యార్థులకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ వారికి దగ్గర్లో కాంటాక్ట్ ఉన్న 488 మంది విద్యార్థుల నమూనాలను కూడా పరీక్ష కొరకు పంపించారు. దీంతో ఈ పరీక్షల అనంతరం 85 మంది విద్యార్థులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది.
దీంతో పాఠశాలలో మొత్తం ప్రిన్సిపాల్ తో పాటు.. 85 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు పేర్కొన్నారు.
వీళ్లంతా కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాత.. RT-PCR పరీక్ష చేయిస్తామని.. తర్వాత ఈ పరీక్షలో నెగిటివ్ వచ్చిన వాళ్లన డిశ్చార్జ్ చేస్తామని ఆరోగ్యశాఖ సిబ్బంది తెలిపారు.
మరికొన్ని నమూనాల నివేదికలు ఇంకా రావలసి ఉందని అధికారులు తెలిపారు. డాక్టర్ల ప్రకారం.. 70 శాతం మంది విద్యార్థులు జ్వరం, దగ్గు మరియు ముక్కు దిబ్బడతో బాధపడుతున్నారన్నారు. ఒక్కరోజే ఉత్తరాఖండ్ లో నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరుకు ఒమిక్రాన్ కేసులు ఎనిమిదికి చేరినట్లు పేర్కొన్నారు. సోకిన వారిలో.. ఒక కేసు అహ్మదాబాద్లో మరియు మూడు కేసులు డెహ్రాడూన్లో ఉన్నాయన్నారు. కొత్త వేరియంట్తో ఇంతకు ముందు సోకిన నలుగురు కోలుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో డిసెంబర్ 11న ఒక ఒమిక్రాన్ కేసు, డిసెంబర్ 27న మరో మూడు కేసులు నమోదయినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…