ఈ కరోనా నేపధ్యంలో సంవత్సరకాలం విరామం తరువాత పిల్లల చదువులు అటకెక్కాయి. స్కూల్స్ పునఃప్రారంభం తరువాత చాలా మంది పిల్లలు వారు ఇప్పటి వరకు చదివినది అంతా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో మళ్ళి పంజా విసురుతోంది కరోనా మహమ్మారి. ఇటీవలే స్కూల్స్, కాలేజిలు తెరిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఉగ్రరూపం చూపిస్తోంది.
పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజగా తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 15 మందికి కరోనా సోకింది. అందులో 12 మంది ఉపాద్యాయులు, ఇద్దరు వంట నిర్వాహకులు, ఒక విద్యార్ధి ఉన్నారు. కాగా, మిగలిన వారికి ఎటువంటి లక్షణాలు బయటపడలేదు. మరో వైపు కరీంనగర్ లోని రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక విధ్యార్దికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ తరుణంలో పిల్లలను పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడే వాతావరణం కలుగుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…