కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని అంతా సంతోషపడుతున్న సమయంలో ఒమిక్రాన్ మళ్లీ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకు ఎవరినీ వదిలి పెట్టడం లేదు. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ , యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
వాళ్లంతా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో బాధపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.
అయితే కరోనా పరీక్షలు చేయించకున్న వారికి ఒక వేళ పాటిజివ్ వస్తే.. దానిని టెస్టుల కొరకు కొంత సమయం తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ వైరస్ లాంటివి ఏమైనా సోకిందా అనే కోణంలో పరీక్షించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టుకు పంపిస్తున్నారు. అయితే విక్రమ్ కు సోకిందా కరోనా.. ఒమిక్రాన్ అనేది వైద్యులు నిర్ధారించలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు.
అతడి రిపోర్టును కూడా జీనోమ్ కు పంపించనట్లు తెలుస్తోంది. ఇక హీరో విక్రమ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. రెండు మూడు రోజుల నుంచి ఈ మమమ్మార కేసులు మళ్లీ పెరుగుతుండటం.. సినీ ప్రముఖులకు వదలకపోవడంతో సినీ వర్గాలు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.
దీనిపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…