FILE PHOTO: A woman holds a small bottle labelled with a "Coronavirus COVID-19 Vaccine" sticker and a medical syringe in this illustration taken October 30, 2020. REUTERS/Dado Ruvic/File Photo
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం మనముందున్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్.దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ వైరస్ ను కట్టడి చేయగలమని అధికారులు తెలియజేస్తున్నారు.ఈ సమయంలోనే వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా శరీరంలో అయితే రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్) తక్కువగా ఉన్న వారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకుంటే అది పని చేస్తుందా? ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే సందేహాలు తరచూ తలెత్తుతున్నాయి. మరి ఈ విషయాలకు నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా వయసు పైబడే కొద్దీ మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మన పై ఎన్నో రకాల వైరస్ లు దాడి చేసి మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంటాయి. అందుకోసమే చాలామంది రోగనిరోధక శక్తి పెరిగే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల వ్యాధి వ్యాపింప చేసే బ్యాక్టీరియాలు లేదా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని ఎదుర్కొనే యాంటీబాడీలను రోగనిరోధక శక్తి ఉత్పత్తి చేస్తుంది. అందుకోసమే మన శరీరంలో అధికంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే కరోనా వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వేయడం వల్ల వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి పెరుగుతుంది. కనుక వయసుపైబడిన వారు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలనీ తెలియజేస్తున్నారు.i వ్యాక్సిన్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది కానీ వైరస్ ను చంపదు. ఈ క్రమంలోనే మన శరీరంలో సహజంగా యాంటీబాడీలు ఉత్పత్తి కావడం వల్ల వ్యాధితో పోరాడుతాయి. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వైరస్ బారిన పడిన మరణం సంభవించదని నిపుణులు తెలియజేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…