FILE PHOTO: A woman holds a small bottle labelled with a "Coronavirus COVID-19 Vaccine" sticker and a medical syringe in this illustration taken October 30, 2020. REUTERS/Dado Ruvic/File Photo
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం మనముందున్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్.దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ వైరస్ ను కట్టడి చేయగలమని అధికారులు తెలియజేస్తున్నారు.ఈ సమయంలోనే వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా శరీరంలో అయితే రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్) తక్కువగా ఉన్న వారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకుంటే అది పని చేస్తుందా? ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే సందేహాలు తరచూ తలెత్తుతున్నాయి. మరి ఈ విషయాలకు నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా వయసు పైబడే కొద్దీ మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే మన పై ఎన్నో రకాల వైరస్ లు దాడి చేసి మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంటాయి. అందుకోసమే చాలామంది రోగనిరోధక శక్తి పెరిగే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల వ్యాధి వ్యాపింప చేసే బ్యాక్టీరియాలు లేదా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని ఎదుర్కొనే యాంటీబాడీలను రోగనిరోధక శక్తి ఉత్పత్తి చేస్తుంది. అందుకోసమే మన శరీరంలో అధికంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే కరోనా వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వేయడం వల్ల వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి పెరుగుతుంది. కనుక వయసుపైబడిన వారు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలనీ తెలియజేస్తున్నారు.i వ్యాక్సిన్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది కానీ వైరస్ ను చంపదు. ఈ క్రమంలోనే మన శరీరంలో సహజంగా యాంటీబాడీలు ఉత్పత్తి కావడం వల్ల వ్యాధితో పోరాడుతాయి. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వైరస్ బారిన పడిన మరణం సంభవించదని నిపుణులు తెలియజేస్తున్నారు.
హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…
రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…