General News

చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయ్యింది.. ఇదే సాక్ష్యం!

గత సంవత్సరన్నర కాలం పాటు ప్రపంచ దేశాలన్నింటికీ వణికిస్తున్న కరోనా మహమ్మారి మొట్టమొదటిసారిగా చైనాలోని ఊహాన్ ప్రాంతంలో నమోదు కాగా ప్రపంచ దేశాలన్నీ చైనా దేశం పై తప్పుబట్టాయి. కావాలనే చైనా ప్రభుత్వం జీవ ఆయుధాన్ని తయారుచేసే ప్రపంచంపై వదిలిందని పలు దేశాలు ఆరోపణలు చేశాయి. అయితే ఇప్పటికీ సార్స్‌కోవ్‌-2 ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపించింది అనే విషయాల గురించి పరిశోధకులు నిరంతరం అన్వేషణ కొనసాగిస్తున్న ఇప్పటికీ ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు.

తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి ఓ సమాచారాన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ దీనికి సంబంధించి ఓ కథనం ప్రచురించింది. వైరస్‌ విషయం బయటికి రావడానికి ముందే చైనాలోని ఊహన్ ల్యాబ్ లో ముగ్గురు పరిశోధకులు మృత్యువాత పడ్డారని ఈ పత్రిక వెల్లడించింది. అమెరికా ఇంటిలిజెన్స్ నిపుణుల ఆధారంగా కరోనా విషయంలో మరోసారి చైనా పాత్ర బయటపడింది.

ప్రపంచానికి తీవ్ర గందరగోళానికి గురి చేసిన సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ వ్యాపించడానికి ముందే వుహాన్‌ ల్యాబ్‌లో కొంతమంది పరిశోధకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించింది. వీరిలో సాధారణ ఫ్లూ కనిపించే జ్వరం, పొడిదగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయని, కరోనా బారిన పడిన వారిలో కూడా ఇదే లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. అయితే వారు ఏవిధంగా మృత్యువాత పడ్డారని విషయం గురించి సరైన ఆధారాలు లేవు.

మొట్టమొదటిసారిగా చైనాలోని తొలి కరోనా వైరస్ కేసు డిసెంబర్‌ 8,2019న నమోదైంది. కానీ అప్పటికే చైనాలో ఎంతోమంది ఈ వైరస్ బారిన పడినట్లుగా అంటువ్యాధుల చికిత్స నిపుణులు చెబుతున్నారు. అంటువ్యాధుల చికిత్స నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రభుత్వం పై ఇన్ని రకాలుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనావైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం బయటకు ఇవ్వకపోవడంతో చైనా పై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

24 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago