Featured

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న జగన్ సర్కార్ ఏకంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా 1000 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం ద్వారా కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 4,762 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.

ఏపీలో కోటికి పైగా పరీక్షలు చేశామని.. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడం ద్వారా సులభంగా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రం కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సక్సెస్ అయిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిన్న కొత్తగా 500 కరోనా కేసులు నమోదు కాగా 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వేగంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండటంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల రెండవ వారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. తెలంగాణ సర్కార్ డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. వ్యాక్సిన్ ను నిల్వ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం స్టోరేజ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. రోజుకు 100 మంది చొప్పున 2.67 లక్షల మందికి ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. త్వరలో అందుబాటులోకి రాబోయే సాఫ్ట్ వేర్ లో రిజిష్టర్ చేసుకొని కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ ను వేయించుకోవాలి. ఈ నెల చివరి వారం నుంచి వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

మరోవైపు ఏపీలో జగన్ సర్కార్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సి ఉంది. ప్రాధాన్యత ఆధారంగా జగన్ సర్కార్ యువతకు మినహా మిగిలిన వారికి వ్యాక్సిన్ ను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago