Featured

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న జగన్ సర్కార్ ఏకంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా 1000 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం ద్వారా కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 4,762 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.

ఏపీలో కోటికి పైగా పరీక్షలు చేశామని.. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడం ద్వారా సులభంగా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రం కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సక్సెస్ అయిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిన్న కొత్తగా 500 కరోనా కేసులు నమోదు కాగా 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వేగంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండటంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల రెండవ వారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. తెలంగాణ సర్కార్ డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. వ్యాక్సిన్ ను నిల్వ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం స్టోరేజ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. రోజుకు 100 మంది చొప్పున 2.67 లక్షల మందికి ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. త్వరలో అందుబాటులోకి రాబోయే సాఫ్ట్ వేర్ లో రిజిష్టర్ చేసుకొని కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ ను వేయించుకోవాలి. ఈ నెల చివరి వారం నుంచి వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

మరోవైపు ఏపీలో జగన్ సర్కార్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సి ఉంది. ప్రాధాన్యత ఆధారంగా జగన్ సర్కార్ యువతకు మినహా మిగిలిన వారికి వ్యాక్సిన్ ను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

42 minutes ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

46 minutes ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

49 minutes ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 hours ago