Featured

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న జగన్ సర్కార్ ఏకంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా 1000 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం ద్వారా కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 4,762 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.

ఏపీలో కోటికి పైగా పరీక్షలు చేశామని.. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడం ద్వారా సులభంగా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రం కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సక్సెస్ అయిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిన్న కొత్తగా 500 కరోనా కేసులు నమోదు కాగా 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వేగంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండటంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల రెండవ వారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. తెలంగాణ సర్కార్ డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. వ్యాక్సిన్ ను నిల్వ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం స్టోరేజ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. రోజుకు 100 మంది చొప్పున 2.67 లక్షల మందికి ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. త్వరలో అందుబాటులోకి రాబోయే సాఫ్ట్ వేర్ లో రిజిష్టర్ చేసుకొని కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ ను వేయించుకోవాలి. ఈ నెల చివరి వారం నుంచి వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

మరోవైపు ఏపీలో జగన్ సర్కార్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సి ఉంది. ప్రాధాన్యత ఆధారంగా జగన్ సర్కార్ యువతకు మినహా మిగిలిన వారికి వ్యాక్సిన్ ను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

6 minutes ago

యంగ్ ఏజ్‌లోనే లివర్ రిస్క్.. ఫ్యాటీ లివర్‌కు ఆహారమే కారణమా? కొత్త అధ్యయనం ఏమంటోంది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…

17 minutes ago

రహానేకు డబుల్ షాక్.. ఓటమి + రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…

23 minutes ago

వెంకీ కెరీర్ మార్చిన సినిమా.. సిరివెన్నెల ఆసక్తికర విశ్లేషణ

తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…

35 minutes ago

అండమాన్ సముద్రంలో విషాదం.. 250 మంది గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…

46 minutes ago

సేవా హృదయుడి ఆధ్యాత్మిక యాత్ర… తిరుమల చేరుకున్న సోనూ సూద్!

ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…

47 minutes ago