సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తారు.తనకు ఏ చిన్నపాటి అనారోగ్యం కలిగినా వెంటనే డాక్టర్లను సంప్రదించి తన బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు పడతారు. ఈ క్రమంలోనే తల్లికి ఏదైనా వ్యాధి సంక్రమించిన అది బిడ్డకు సోకకుండా వైద్య శాస్త్రం బిడ్డకు ఎంతో రక్షణ కల్పిస్తుంది. ఈ క్రమంలోనే తల్లి ఎన్నో రకాల వ్యాధుల బారినపడినప్పటికీ ఆ వ్యాధుల బారిన పడకుండా బిడ్డను రక్షిస్తుంది.
తాజాగా వైద్యులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే ఒక విచిత్ర సంఘటన వారణాసిలో చోటుచేసుకుంది. వారణాసికి చెందిన అనిల్ ప్రజాపతి అనే వ్యక్తి నెలలు నిండిన తన భార్య సుప్రియను ప్రసవం కోసం బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిధిలోని ఎస్ఎస్ ఆస్పత్రికి ఈ నెల24 ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే అక్కడి వైద్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా సుప్రియకు కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.
ఈ క్రమంలోనే వైద్యులు మరుసటిరోజు ఆమెకు ప్రసవం చేశారు. సుప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వైద్యులు పుట్టిన శిశువుకి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ శిశువు పరీక్షల ఫలితాలను చూసి డాక్టర్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా ఫలితాలలో పాజిటివ్ వచ్చింది. తల్లికి కరోనా లేకున్నా బిడ్డకు పాజిటివ్ రావడంతో డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తన భార్యకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. కానీ బిడ్డకు మాత్రం పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పరీక్ష ఫలితాలు తప్పుగా వచ్చి ఉంటాయని ఆయన తెలిపారు. ఈ విషయమే ఆసుపత్రి సూపర్-ఇండెంట్ మాట్లాడుతూ మరి కొద్ది రోజులలో తల్లి బిడ్డ ఇద్దరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని, ప్రస్తుతానికి తల్లీ బిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియజేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…