భారతదేశంలోని ప్రజలు కరోనా వైరస్ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి ప్రజల్లో ఆందోళనను పెంచుతూ కొత్త భయాలను సృష్టిస్తోంది. కరోనా వైరస్ వల్ల ప్రజల జీవన విధానంలో పూర్తిగా మార్పులొచ్చాయి. భవిష్యత్తులో కరోనా విజృంభణ తగ్గినా సాధారణ పరిస్థితులు ఏర్పడటం మాత్రం అంత తేలిక కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వైరస్ ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తూ కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కీలక విషయాలను వెల్లడించారు. నైట్రస్ ఆక్సైడ్ అనే కెమికల్ కాంపౌండ్ తో కరోనా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్వీడన్ దేశానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
2003 సంవత్సరంలో సార్స్ ను ఏ విధంగా కట్టడి చేయగలిగామో కరోనా మహమ్మారిని కూడా అదే విధంగా కట్టడి చేయడం సాధ్యమవుతుందని వెల్లడించారు. రెడాక్స్ బయాలజీ అనే జర్నల్ లో పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు నైట్రస్ ఆక్సైడ్ కరోనాపై ప్రత్యక్షంగా ప్రబావం చూపగలదని.. కొన్ని సందర్భాల్లో మానవ శరీరంలోనే నైట్రస్ ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు.
తాము చేసిన పరిశోధనల్లో నైట్రస్ ఆక్సైడ్ కరోనా వైరస్ పై ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా వల్ల ఎవరిలోనైనా లంగ్స్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు వస్తే అలాంటి సమయంలో గ్యాస్ రూపంలో నైట్రస్ ఆక్సైడ్ ను ఇవ్వడం వల్ల కరోనా రోగుల్లో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే నైట్రస్ ఆక్సైడ్ గురించి మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…