CVL Narasimha Rao : విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించిన సీనియర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి సీక్రెట్ ను అతడే బయట పెట్టి సినిమాకు ఓ కీలకంగా వ్యవహరిస్తాడు. అయితే ఇదిలా ఉండగా.. అతడు ఠాగూర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడారు. అతడు ప్రొఫెషన్ గా ఒక లాయర్.. లాయర్లు సాధారణంగా మోసపోరు కదా.. మీరెప్పుడైనా మోసపోయారా అని అతడిని ప్రశ్నించగా.. ఒక స్కూటర్ విక్రయించే విషయంలో మోసపోయినట్లు చెప్పిన అతడు.. మరో మోసం గురించి కూడా చెప్పారు.
రక్ష అనే ఆర్గనైజేషన్ పెట్టి 25 ఏళ్లు అయిందని.. దానిలో యాంటీ కరెప్షన్ వింగ్ లో రిటైర్డ్ డీజీపీతో ఒక సంవత్సరం వరకు నడిపినట్లు తెలిపారు. ఠాగూర్ సినిమా రావడానికి రెండు సంవత్సరాల ముందు ఇలా నడిపామని.. దానిలో ఎలాంటి అవినీతి ఉండకూడదని అనేది మెయిన్ థీమ్. అయితే ఠాగూర్ సినిమా సమయంలో ప్రొడ్యూసర్స్, వివి వినాయక్ తో కలిసి దీనికోసం ఒక వెబ్ సైట్ చేద్దామని అనుకున్నాం… దాని పేరు కూడా ‘ఫర్ యూ’ అని కూడా అనుకున్నామని చెప్పారు.
దానితో జనాలకు సేవ చేయడానికి వీలు ఉంటుందని అనుకున్నారట. దాని ఆధారంగానే ఠాగూర్ సినిమా తీసామని.. తీరా సినిమా రిలీజ్ అయి మొదటి షో పడగానే.. వెబ్ సైట్ గురించి మాట్లాడితే.. ఇక అలాంటిది ఏమి అవరసం లేదని, సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది ఇంకా పబ్లిసిటీ తో పనేముంది అని మోసం చేశారని నరసింహారావు చెప్పుకొచ్చారు. ఇలాంటిదే యువసేన సినిమాకు కూడా జరిగిందని ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…