Daggubati Rana: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సురేష్ బాబు, హీరో రానా దగ్గుబాటి కి తాజాగా కోర్టు నుండి పెద్ద షాక్ ఇచ్చింది. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీంతో వారిని కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. గతంలో షేక్ పేట మండలం సర్వేనెంబర్..
403 లో సినీ నటి మాధవి 1007 గజాల స్థలంను నిర్మాత సురేష్ బాబుకు అమ్మింది. అయితే ఆ స్థలంను సురేష్ బాబు 2014లో అనే వ్యాపారికి హోటల్ ఏర్పాటు కోసం లీజుకి ఇచ్చాడు. అయితే 2018 ఫిబ్రవరిలో లీజు ముగుస్తుండగా ప్లాట్ నెంబర్ 2 లో ఉన్న స్థలాన్ని సురేష్ బాబు18 కోట్లకు అమ్మడానికి అంగీకరించాడు. దీంతో ప్రమోద్ కుమార్ ఐదు కోట్లు సురేష్ బాబుకు చెల్లించాడు.
ఇక లీజు ముగిసిన తర్వాత ఖాళీ చేయటం లేదు అని కేసు కూడా వేశారు సురేష్ బాబు. దీంతో ప్రమోద్.. తన వద్ద రూ. ఐదు కోట్లు అడ్వాన్స్ గా తీసుకొని రిజిస్ట్రేషన్ చేయలేదని కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కోర్టు కేసులు తేలకముందే ఆ స్థలాన్ని సురేష్ బాబు రానాకు విక్రయించాడు.
దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఈ విషయం గురించి చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఇక వెంటనే కోర్టు సురేష్ బాబును, రానా ను వ్యక్తిగతంగా హాజరు కావాలి అని జనవరి 19న సమన్లు జారిచేసింది. ఇక తర్వాత విచారణ మే ఒకటికి వాయిదా వేయగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…