Dammaigudem Indhu death mistery : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది చిన్నారి ఇందు మరణం. స్కూల్ కి వెళ్లిన అమ్మాయి శవంగా తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇందు అనే చిన్నారి దమ్మాయిగూడెం చెరువులో శవంగా కనిపించింది. తన మరణానికి గల కారణాలు ఇంకా సస్పెన్స్ గా ఉన్నాయి. స్కూల్ కి వెళ్లిన చిన్నారి మరుసటి రోజు ఉదయం చెరువులో శవమై తేలింది. తానే చెరువు వద్ద ప్రమాదవశాత్తు పడి మరణించి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నా ఇందు తల్లిదండ్రులు మాత్రం ఎవరో చంపి చెరువులో వేసారంటూ ఆరోపిస్తున్నారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే ఇందు బ్రతికేదని స్థానికులు పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరో చంపి చెరువులో వేశారు… మాకు న్యాయం జరగాలి…
ఇందు మరణం వెనుక ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. కానీ ఇందు తల్లిదండ్రులు, స్థానికులు మాత్రం తాను చెరువులో పడి మరణించలేదని ఎవరో చంపి, చెరువులో వేసారంటూ ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందు చిన్న పిల్ల అయినా చాలా తెలివైన పిల్ల అని, చెరువు దగ్గరికి వెళ్ళవల్సిన పని లేదని, చాలా జాగ్రత్తగా ఉంటుందంటూ స్థానికులు చెప్తుండగా, స్కూల్ కి వెళ్తున్నపుడు చివరగా ఇందు తో మాట్లాడానని ఇలా శవమై ఇంటికి వస్తుందని అనుకోలేదంటూ ఇందు తల్లి రోదిస్తోంది. ఇక తమ బిడ్డకు న్యాయం చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ ఇందు తల్లిదండ్రులు అడుగుతున్నారు.
పోలీసులు చెరువులో ఇందు శవం దొరికాక కనీసం తల్లిదండ్రులకు చూపించలేదని, గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్ళేటపుడు కూడా పాప తరుపున వాళ్ళను తీసుకుపోలేదని వెంటపడి గొడవ చేసినా అంబులెన్సులో ఎక్కించుకోలేదంటూ స్థాసనికులు ఆరోపించారు. పాప ఒంటి పై గాయాలు ఉన్నాయని కానీ పోలీసులు మాత్రం గాయాలు లేవని ఊపిరి తిత్తుల్లో నీరు చేరి పాప మరణించిందంటూ రిపోర్ట్ వచయిందని చెబుతున్నారంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాపకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…