Featured

Dammaigudem Indhu death mistery : చెరువు వద్దకు వెళ్లే ముందు ఆ పాప మా చెల్లిని కూడా రమ్మని అడిగింది… దమ్మాయిగూడ ఘటనలో స్కూల్ పూర్వ విద్యార్థి సద్దాం హుస్సేన్ చెప్పిన నమ్మలేని నిజాలు…!

Dammaigudem Indhu death mistery : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఎన్టీఆర్ కాలనీ కి చెందిన ఇందు అనే చిన్నారి దమ్మాయిగూడెం చెరువులో శవంగా కనిపించింది. తన మరణానికి గల కారణాలు ఇంకా సస్పెన్స్ గా ఉన్నాయి. స్కూలుకి వెళ్లిన చిన్నారి మరుసటి రోజు ఉదయం చెరువులో శవమై తేలింది. తానే చెరువు వద్ద ప్రమాదవశాత్తు పడి మరణించి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నా ఇందు తల్లిదండ్రులు మాత్రం ఎవరో చంపి చెరువులో వేసారంటూ ఆరోపిస్తున్నారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే ఇందు బ్రతికేదని స్థానికులు పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు ఇందు స్కూల్ కి వెళ్లి మధ్యలో ఇంటికి ఎందుకు వెళ్ళిందనే విషయాలను సద్దాం హుస్సేన్ అనే పూర్వ విద్యార్థి వివరించారు.

మా చెల్లిని కూడా వెళదామని పిలిచింది…

సద్దాం హుస్సేన్ అదే ప్రభుత్వ పాఠశాల లో పదోతరగతి వరకు చదివాడు. ఇక అతని చెల్లెలు, ఇందుతో పాటు చదువుతోంది. ఇందు మిస్ అయిన రోజున 9:20 గంటలకే స్కూల్ కి వచ్చింది. అయితే బుక్ మర్చిపోవడం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్లి బుక్ తెచ్చుకోవాలని మరో ఇద్దరమ్మాయిలను కుడా అడుగగా వాళ్ళు రాలేదు, నా చెల్లిని కూడా పిలిచింది అయితే రానని చెప్పడం తో ఒక్కతే ఇంటికి వెళ్ళింది ఇందు. స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే మార్గంలోనే దమ్మాయిగూడెం చెరువు ఉందని సద్దాం హుస్సేన్ తెలిపాడు. స్కూల్ 9:30 కి మొదలువుతుంది ఆ లోపే వెళ్ళింది. ఇందు ఇక క్లాస్ స్టార్ట్ అయ్యాక అటెండెన్స్ వేసే సమయంలో ఇందు ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో ఇంటికి ఫోన్ చేసి టీచర్ అడిగాడు అయితే ఇందు ఇంటికి రాలేదని ఇందు తండ్రి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.

10:30 ప్రాంతంలో పోలీసులకు చెప్పినా స్పందించలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో వచ్చి డాగ్స్ తీసుకొచ్చి గాలించారు. దమ్మాయిగూడెం పరిసరాల్లో వెతుకగా మరుసటి రోజు ఉదయం 11 గంటల సమయంలో చెరువులో శవం లభించింది. పోలీసులు శవాన్ని తల్లిదండ్రులకు కూడా చూపించకుండా గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. గొడవ చేసినా చూపించలేదు, దమ్మాయి గూడెం పరిసరాల్లో చెరువు కట్ట సరిగా లేదు అదీ కాక అక్కడ గంజాయి తినే యువత ఎక్కువగా ఉంటుంది. ఆ ఏరియాలో అమ్మాయిలు వెళ్లాలంటే చాలా భయపడతారు, అక్కడ కనీసం ఒక సీసీటీవీ కెమెరా కూడా లేదు. పోలీసులు ఏమి జరిగిన పట్టించుకోరు, ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి అలానే మరణించింది అంటూ సద్దాం హుస్సేన్ తెలిపాడు.

Bhargavi

Recent Posts

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

19 minutes ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

49 minutes ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

1 hour ago

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

21 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago