Dancer Pandu: సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రతివారం ఒక స్పెషల్ ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ కార్యక్రమాల ద్వారా తమ జీవితంలో జరిగిన కొన్ని చేత సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమో అందరి చేత కంటతడి పెట్టించిందని చెప్పాలి. మంగమ్మగారి కొడుకు అనే ఎపిసోడ్ ద్వారా ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లో ఎప్పటిలాగే తమదైన శైలిలో సందడి చేస్తూ ఆటపాటలతో అందరిని నవ్వించారు. ఇక చివరిలో ఒక్కసారిగా డాన్సర్ పండు తన ప్రియురాలిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై పండు మాట్లాడుతూ తనకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అయితే తన ప్రియురాలు తన జీవితంలోకి వచ్చి తాను తన తల్లిలా చూసుకుంటానని తనకు ప్రామిస్ చేసింది. నేను కూడా తనని తల్లి తల్లి అంటూ పిలుచుకునే వాడిని. అయితే తను కూడా నా తల్లి వద్దకే వెళ్లిపోయింది. ఆ అమ్మాయి నన్ను బాగా చూసుకోవడంతో బహుశా మా అమ్మకే కుళ్ళు వచ్చిందేమో నాకన్నా నా కొడుకుని బాగా చూసుకుంటుందని తన వద్దకు తీసుకెళ్లింది అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ విధంగా పండు తన ప్రియురాలు గురించి తలుచుకొని ఎమోషనల్ కాగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎంటర్టైన్మెంట్ చూడాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాలి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…