Dasara: నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకుని థియేటర్ల వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. అత్యధిక వసూలు రాబట్టిన ఈ సినిమా నాని కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్గా నిలిచింది.
ఈ సినిమా విడుదలై ఇప్పటికే 15 రోజులు గడిచినప్పటికీ ఈ సినిమా హవా మాత్రం తగ్గటం లేదు ఇప్పటికి థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తూ వసూళ్లు సాధిస్తుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రూ 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక ఈ సినిమా లో నాని అద్భుతమైన నటనకు సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఇక మహానటి సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తీ సురేష్ ఈ సినిమాలో డీ – గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా సక్సెస్ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం ప్రతిభ ముఖ్య కారణం అని చెప్పవచ్చు. దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ మొదటి సినిమాతోనే తన సత్తా నిరూపించుకున్నాడు. ఇంతకాలం థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలలో ప్రేక్షకులలో అలరించడానికి సిద్ధమయ్యింది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మే 30 నుండి దసరా సినిమా ఓటీటీ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 22 కోట్లకు దసరా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. మే 30 వ తేది నుండి దసరా సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.థియేటర్లో ప్రేక్షకులను సందడి చేసిన దసరా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆధారపడి పొందుతుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…