Dasari Vignan : లైగర్ సినిమా బాగుంది, హిట్ అన్న టాక్ వినడం గురించి పక్కన పెడితే సినిమా ప్లాప్ అని ఒకరోజుకే చెప్పేస్తున్నారు. అయితే సినిమా మిశ్రమ స్పందనతో నడుస్తోంది. కానీ కొన్ని రివ్యూలు విశ్లేషణలు మాత్రం సినిమా ప్లాప్ అన్నట్లు మొదటి రోజుకే చెప్పేస్తున్నారు. ఇక విజయ్ మీద పూరీ మీద చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. కానీ యాంకర్ అనసూయా పెట్టిన ఒక ట్వీట్ మాత్రం మళ్ళీ చర్చకు దారితీసింది. అర్జున్ రెడ్డి టైములో వచ్చిన వివాదం మళ్ళీ తెర మీదకు తెచ్చింది అనసూయ ఒక్క ట్వీట్ తో, దీంతో మళ్ళీ ఆ విషయం గురించి చర్చించుకుంటున్నారు.
అయిపోయిన సంఘటన ఇప్పుడెందుకు మళ్ళీ లేవనేత్తడం…
‘అర్జున్ రెడ్డి’ సినిమా ఆడియో విడుదల సమయంలో విజయ్ ఫ్యాన్స్ తో బూతి పదాన్ని చెప్పించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక ఈ విషయంలో చాలా ఘాటుగా అప్పట్లో అనసూయ మాట్లాడింది. అయితే అదంతా ముగిసిపోయి మళ్ళీ విజయ్ నిర్మాణం లో ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించింది కూడా అనసూయ కానీ ఇన్నాళ్లకు మళ్ళీ పరోక్షంగా విజయ్ ను అనడంతో చర్చ మొదలైంది. అనసూయ ట్వీట్ చేస్తూ కర్మ ఎవరినీ వదలదు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ కచ్చితంగా అనుభవిస్తారు అంటూ ట్వీట్ చేసింది.
ఇక ఇష్యూ మీద సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు లేవనెత్తడం, లైగర్ సినిమా సరిగా ఆడకపోవడానికి విజయ్ మాత్రమే ఎలా కారణం. ఇకపోతే అనసూయ జబర్దస్త్ లాంటి కామెడీ షో చేసేటపుడు ఎలాంటి డబల్ మీనింగ్ డైలాగులు వాడలేదు? ఇతరులను బాడీ షేమింగ్ చేసినపుడు నవ్వలేదా, మరి వాటికంటే పెద్దదా ఈ విషయం. అయినా అర్జున్ రెడ్డి సమయంలో జరిగింది ఇది అప్పుడు ఖండించారు అయిపోయింది మళ్ళీ ఇపుడు మాట్లాడటం ఆ విషయాన్ని ఎత్తడం తప్పు. ఆల్రెడీ సినిమా ఆశించినంత ఆడలేదనే బాధలో ఉంటే మళ్ళీ ఇదేంటి అంటూ అభిప్రయపడ్డారు దాసరి విజ్ఞాన్.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…