Crime news: అనైతిక సంబంధానికి అడ్డుగా ఉందని.. తల్లిపట్ల దారుణంగా ప్రవర్తించిన కూతురు.. ఏం చేసిందంటే?
Crime news: రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. క్షణకాలం సుఖం కోసం సొంతవాళ్లనే కడతేరుస్తున్నారు. వారి బంగారు జీవితాల్లో చీకటి నింపుకుంటున్నారు. పెళ్లయి పిల్లలు ఉన్నవారు ప్రియుడి మోజులో పడి సొంత పిల్లలు, భర్తలను అత్యంత కిరాతకంగా చంపారనే వార్తలను చూస్తూనే ఉన్నాం. ఇక వావీవరసలు మరిచి విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తమ సుఖానికి అడ్డుగా ఉన్నారని అడ్డు తొలగించుకుంటున్నారు. తాాగాజా ఇటాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కూతురు ప్రియుడితో కలిసి సొంత తల్లినే చంపేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తన సంతోషానికి అడ్డుగా ఉందని సొంత కూతరే కన్న తల్లిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరు కొరటిగెరె పట్టణం సజ్జనర వీధిలో నివాసం సుమిత్ర(45)కు పెళ్లికాని కూతురు శైలజ ఉంది.
శైలజకు సోదరుడి వరసయ్యే దూరపు బంధువు పునీత్ తో పరిచయం ఏర్పడి అనైతిక సంబంధానికి దారి తీసింంది. ఇది తెలుసుకున్న శైలజ తల్లి సుమిత్ర పునీత్ ని తమ ఇంటి వైపు రావద్దని హెచ్చరించింది.
తమ సంబంధానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన శైలజ, తన ప్రియుడు పునీత్ తో కలిసి దారుణమైన నిర్ణయం తీసుకుంది. జనవరి 30న రాత్రి తల్లిని గొంతు పిసికి చంపేసింది. ఇంటి ముందు ఉన్న సంపులో పడేసింది. మరుసటి రోజు తల్లి అనుకోకుండా సంపులో జారి పడి చనిపోయిందని డ్రామాకు తెరలేపింది. అందరికి చెప్పి అంత్యక్రియలు కూడా జరిపింది. కొరటిగెరె పోలీసులకు ఎవరో ఈ కేసు గురించి చెప్పడంతో ఇద్దరిని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…