తెల్లవారితే నిశ్చితార్థం.. కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా నిశ్చితార్థ పనులలో నిమగ్నమయ్యారు. అప్పటికే బంధువులు అందరూ ఇంటికి చేరుకొని ఎంతో కళకళలాడుతోంది. తెల్లవారితే శుభకార్యంతో సంతోషంగా ఉండాల్సిన ఆ ఇంటిని మృత్యువు కబళించింది. తెల్లవారితే నిశ్చితార్థం జరుపుకోవాల్సిన యువతి మరణించడంతో ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసుల వివరాల మేరకు…
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట జయశంకర్ కాలనీకి చెందిన జెట్టూరి శేఖర్, సత్తమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు నవీన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె రోజా ఎమ్మెస్సీ ఫార్మసీ చదివి ప్రైవేట్ ల్యాబ్ లో పని చేస్తోంది. ఈ క్రమంలోనే రోజాకు వికారాబాద్ లో మిషన్ ఆస్పత్రి వైద్యునితో ఆమె వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం వీరి నిశ్చితార్థం కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే నిశ్చితార్థానికి కొత్త దుస్తులను తీసుకురావడానికి రోజా తన స్నేహితురాలు మౌనికతో కలిసి మంగళవారం రాత్రి 7.30 ప్రాంతంలో డిజైనర్ వద్దకు వెళ్లింది. ఆమె దుకాణంలో లేకపోవడంతో ఆమె కోసం దుకాణం బయట ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఈ క్రమంలోనే ఆ భవనం మూడో అంతస్థు పైనుంచి పెద్ద రెయిలింగ్ శకలాలు ఆమె తల పై పడటంతో తీవ్ర గాయాలపాలైఉంది.
ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం రోజాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విధంగా బుధవారం తెల్లవారితే నిశ్చితార్థం జరుపుకోవాల్సిన యువతికి రైలింగ్ రూపంలో మృత్యువు సంభవించడంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. రెయిలింగ్కు పగుళ్ళు ఉన్నాయని యజమాని దృష్టికి తీసుకువెళ్లిన అతడు పట్టించుకోవడం లేదని అక్కడివారు తెలియజేశారు.
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్లో సుహాస్ ఇప్పుడు…
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ నుంచి తాజా టీజర్ విడుదలైంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న…